రామన్నపేటలో సీపీఎస్ ఉద్యోగుల నిరసన.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీపీఎస్ ఉద్యోగులు మంగళవారం నిరసన చేపట్టారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన హామీ మేరకు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఓపీఎస్ అమలవుతుందన్న నమ్మకంతోనే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీతో మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని సీపీఎస్ను రద్దు చేసి, ఉద్యోగులకు భద్రత కల్పించే పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి