రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చేయూత’ పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల (సెప్టెంబర్) 15వ తేదీ వరకు పొడిగించినట్లు చౌటుప్పల్ పురపాలక వర్గం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో పాటు, దివ్యాంగుల నుంచి పెద్దఎత్తున వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని అర్హులైన ప్రజలందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇప్పటివరకు చేయూత పెన్షన్కు దరఖాస్తు చేసుకోని అర్హులు సెప్టెంబర్ 15, 2026 లోపు తమ వివరాలను సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం చేరేలా పురపాలక అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని చైర్పర్సన్, కమిషనర్ కోరారు.
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్పర్సన్ పావని రమేష్ గౌడ్
K.RAVI
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చేయూత’ పెన్షన్ దరఖాస్తుల స్వీకరణ గడువును వచ్చే నెల (సెప్టెంబర్) 15వ తేదీ వరకు పొడిగించినట్లు చౌటుప్పల్ పురపాలక వర్గం ప్రకటించింది. ఈ మేరకు పురపాలక చైర్పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్లో ప్రస్తుతం కొనసాగుతున్న సర్ ప్రక్రియతో పాటు, దివ్యాంగుల నుంచి పెద్దఎత్తున వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు.చౌటుప్పల్ పురపాలక సంఘం పరిధిలోని అర్హులైన ప్రజలందరూ ఈ పొడిగించిన గడువును సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఇప్పటివరకు చేయూత పెన్షన్కు దరఖాస్తు చేసుకోని అర్హులు సెప్టెంబర్ 15, 2026 లోపు తమ వివరాలను సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఈ సమాచారం చేరేలా పురపాలక అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని చైర్పర్సన్, కమిషనర్ కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి