రామన్నపేట: మండలంలోని ఉత్తటూరు గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తటూరు BRS పార్టీ యువ నాయకుడు మేడిరాజు అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, పంటలు సమృద్ధిగా పండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక ఐక్యతను పెంపొందిస్తున్నాయని అన్నారు.
అనంతరం రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి