Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 10:40 PM

పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు
30-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న గ్రామం

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన మహిళలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించడంతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ​ఉదయం నుంచే మహిళలు సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ​ఈ ఉత్సవాల్లో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన బంధుమిత్రులు, చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పంతంగిలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్థులంతా ఐక్యంగా పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు.

Sthanikam

పంతంగిలో ఘనంగా ముత్యాలమ్మ బోనాలు

Article Image

ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్న గ్రామం

భక్తిశ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యాలు సమర్పించిన మహిళలు

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో గ్రామ దేవత ముత్యాలమ్మ బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగాయి. పండుగను పురస్కరించుకుని ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, తోరణాలతో ప్రత్యేకంగా అలంకరించడంతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ​ఉదయం నుంచే మహిళలు సాంప్రదాయబద్ధంగా అలంకరించిన బోనాలను శిరస్సుపై ఎత్తుకుని, డప్పు చప్పుళ్లు, శివసత్తుల సిగాలు, పోతురాజుల విన్యాసాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు. ​ఈ ఉత్సవాల్లో స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన బంధుమిత్రులు, చిన్నారులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పంతంగిలో పండుగ సందడి నెలకొంది. గ్రామస్థులంతా ఐక్యంగా పాల్గొని బోనాల పండుగను విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News