భౌతికకాయానికి చౌటుప్పల్ ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య నివాళులు
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉదరి రాములు ఆదివారం నాడు స్వర్గస్తులయ్యారు. వారి మృతి పట్ల చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాములు భౌతికకాయానికి ఉబ్బు వెంకటయ్య పూలమాలలు వేసి అశ్రునయనాల నడుమ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పార్టీ అభివృద్ధికి, గ్రామాభ్యుదయానికి రాములు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యం చెప్పారు.
ఈ నివాళులర్పించిన కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కొండూరు వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) కార్యదర్శి బత్తుల లింగస్వామి గౌడ్, పార్టీ ముఖ్య నాయకులు బాలగోని వెంకటేష్, రావుల స్వామి, కేతరాజు రాజు, సామకూర యాదయ్య, ఇప్ప వెంకటేష్, బొజ్జ బుచ్చయ్య, ఉదరి రామచంద్రం, ఊదరి నరసింహ, ఉదరి మల్లేష్, ఊదరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి