Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్‌ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 11:32 AM

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టార్చ్‌ ర్యాలీ

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టార్చ్‌ ర్యాలీ

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు  మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టార్చ్‌ ర్యాలీ
30-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలో క్రీడా వేడుకలను మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి స్థానిక స్టేడియం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర నిర్వహించిన టార్చ్‌ ర్యాలీని ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాల పెంపొందింపులో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రవళికకు సన్మానం

చైనాలో జరిగిన అంతర్జాతీయ 4×400 మీటర్ల అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన డిండి గ్రామానికి చెందిన క్రీడాకారిణి ప్రవళికను మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌ సూచన మేరకు రూ.30 వేల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రవళికను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

Sthanikam

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవ వేడుకలు మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో టార్చ్‌ ర్యాలీ

Article Image

నల్లగొండ: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్లగొండ పట్టణంలో క్రీడా వేడుకలను మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి జిల్లా కలెక్టరేట్‌ నుంచి స్థానిక స్టేడియం వరకు సుమారు 2 కిలోమీటర్ల మేర నిర్వహించిన టార్చ్‌ ర్యాలీని ప్రారంభించారు. సుమారు 200 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాల పెంపొందింపులో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయన్నారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రవళికకు సన్మానం

చైనాలో జరిగిన అంతర్జాతీయ 4×400 మీటర్ల అథ్లెటిక్స్‌ పోటీల్లో బంగారు పతకం సాధించిన డిండి గ్రామానికి చెందిన క్రీడాకారిణి ప్రవళికను మేయర్‌ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి ఘనంగా సన్మానించారు. కలెక్టర్‌ సూచన మేరకు రూ.30 వేల నగదు ప్రోత్సాహక చెక్కును అందజేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకు గర్వకారణంగా నిలిచిన ప్రవళికను అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించి దేశానికి, జిల్లాకు కీర్తి తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News