Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంధువులు, స్నేహితుల మధ్య మానస జన్మదిన వేడుకలు “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 08:48 PM

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం
29-08-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ముకుంద నాయక్ తండాకు చెందిన ఆడే పుండ్లిక్ దంపతుల కుమార్తె అరుణ్ బాయి కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ సురేఖ వెంకట్ రాథోడ్ తండాకు వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి, అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సురేఖ వెంకట్ రాథోడ్ పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని, అవసరమైన సమయంలో బాధిత కుటుంబాలకు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎండీఎల్‌ ప్రెసిడెంట్ రాథోడ్ సర్దార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ పరశురామ్ జాదవ్, లక్ష్మణ్, దశరథ్ నాయక్, తండా నాయక్ రమేష్, సర్పంచ్ ఆడే ప్రకాష్, ఉపసర్పంచ్ సరోజ, సంజీవ్ చవాన్, రాములు, మహీపతి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం

Article Image

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం ముకుంద నాయక్ తండాకు చెందిన ఆడే పుండ్లిక్ దంపతుల కుమార్తె అరుణ్ బాయి కొంతకాలంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ సురేఖ వెంకట్ రాథోడ్ తండాకు వెళ్లి మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చి, అంత్యక్రియల నిర్వహణ కోసం రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సురేఖ వెంకట్ రాథోడ్ పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్నారని, అవసరమైన సమయంలో బాధిత కుటుంబాలకు సహాయం చేస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎండీఎల్‌ ప్రెసిడెంట్ రాథోడ్ సర్దార్, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ పరశురామ్ జాదవ్, లక్ష్మణ్, దశరథ్ నాయక్, తండా నాయక్ రమేష్, సర్పంచ్ ఆడే ప్రకాష్, ఉపసర్పంచ్ సరోజ, సంజీవ్ చవాన్, రాములు, మహీపతి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News