రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య దంపతులకు రాఖీ కట్టిన లక్ష్మమ్మ.
వెలిమినేడు: రాఖీ పౌర్ణమి సందర్భంగా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో అన్నాచెల్లెళ్ల ఆత్మీయతను చాటే వేడుకలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన రజక సంఘం అధ్యక్షుడు గోలి కిష్టయ్య, ఆయన సతీమణికి వారి చెల్లెలు లక్ష్మమ్మ రాఖీ కట్టి, మిఠాయిలు తినిపించారు. అన్నావదినలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గోలి కిష్టయ్య మాట్లాడుతూ.. తన చెల్లెలు లక్ష్మమ్మ స్వయంగా ఇంటికి వచ్చి రాఖీ కట్టడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆత్మీయతలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.లక్ష్మమ్మ మాట్లాడుతూ.. అన్నావదినల ఆశీస్సులు, ఆప్యాయత, మద్దతు ఎల్లప్పుడూ తమకు ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసే రాఖీ పౌర్ణమి వేడుకలు ఆనందంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి