Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:22 PM

రాజగోపాల్ రెడ్డి నివాసంలో వేడుకగా 'రాఖీ'

రాజగోపాల్ రెడ్డి నివాసంలో వేడుకగా 'రాఖీ'

రాజగోపాల్ రెడ్డి నివాసంలో వేడుకగా 'రాఖీ'
28-08-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి రాఖీలు కట్టిన సోదరీమణులు

ఆడపడుచులకు పండగ శుభాకాంక్షలు

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు, పరస్పర విశ్వాసానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన హైదరాబాద్ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.

​ముందుగా ఆయన సోదరీమణులు సాంప్రదాయబద్ధంగా రాజ గోపాల్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన మనుమరాలు ‘వాన్య’తో కలిసి ఆయన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మునుగోడుతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పెద్ద ఎత్తున సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగ అని పేర్కొన్నారు. సోదరీమణుల రక్షణ, గౌరవం, భద్రతకు సోదరులు ఎల్లప్పుడూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలను నింపాలని ఆకాంక్షిస్తూ, మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Sthanikam

రాజగోపాల్ రెడ్డి నివాసంలో వేడుకగా 'రాఖీ'

Article Image

ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి రాఖీలు కట్టిన సోదరీమణులు

ఆడపడుచులకు పండగ శుభాకాంక్షలు

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు, పరస్పర విశ్వాసానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన హైదరాబాద్ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.

​ముందుగా ఆయన సోదరీమణులు సాంప్రదాయబద్ధంగా రాజ గోపాల్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన మనుమరాలు ‘వాన్య’తో కలిసి ఆయన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మునుగోడుతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పెద్ద ఎత్తున సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగ అని పేర్కొన్నారు. సోదరీమణుల రక్షణ, గౌరవం, భద్రతకు సోదరులు ఎల్లప్పుడూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలను నింపాలని ఆకాంక్షిస్తూ, మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News