ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కి రాఖీలు కట్టిన సోదరీమణులు
ఆడపడుచులకు పండగ శుభాకాంక్షలు
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు, పరస్పర విశ్వాసానికి ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి వేడుకలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన హైదరాబాద్ నివాసంలో ఘనంగా జరుపుకున్నారు.
ముందుగా ఆయన సోదరీమణులు సాంప్రదాయబద్ధంగా రాజ గోపాల్ రెడ్డికి రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా తన మనుమరాలు ‘వాన్య’తో కలిసి ఆయన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం మునుగోడుతో పాటు వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన పెద్ద ఎత్తున సోదరీమణులు ఎమ్మెల్యేకు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో కుటుంబ వ్యవస్థకు రాఖీ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత కలిగిన పండుగ అని పేర్కొన్నారు. సోదరీమణుల రక్షణ, గౌరవం, భద్రతకు సోదరులు ఎల్లప్పుడూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ పండుగ ప్రతి కుటుంబంలో సంతోషం, శాంతి, సౌభ్రాతృత్వాలను నింపాలని ఆకాంక్షిస్తూ, మునుగోడు నియోజకవర్గ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి