చైతన్యపురి:
మహిళల భద్రత, గౌరవం కోసం పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారని చైతన్యపురి సీఐ సైదులు తెలిపారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం కొత్తపేట్ మహిళా భవన్లో సహచారీలతో రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు.
చైతన్యపురి పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ సహచారీలతో కలిసి రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం వారికి బహుమతులు, స్వీట్లు పంపిణీ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన రక్షాబంధన్ సందేశాన్ని చదివి వినిపించారు.
మహిళల పట్ల గౌరవం, భద్రత, ఆత్మీయత, పరస్పర నమ్మకాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సీఐ సైదులు తెలిపారు. ప్రజలతో సత్సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ మహిళల భద్రత, సాధికారత కోసం కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంపై సహచారీలు ఆనందం వ్యక్తం చేస్తూ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి