విద్యార్థులకు బహుమతుల పంపిణీ
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని మల్లికార్జున హైస్కూల్ విద్యార్థినులు రాఖీ పండగ సందర్భంగా ప్రముఖ న్యాయవాది, మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకు శివకుమార్ గౌడ్ కు ఆయన స్వగృహంలో రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అక్కాచెల్లెళ్ల ప్రేమానురాగాలకు ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెరుకు శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ... విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. జీవితంలో ఉన్నత ఆశయాలను ఏర్పరచుకుని వాటి సాధనకు కష్టపడాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. అనంతరం రాఖీలు కట్టిన విద్యార్థినులకు చాక్లెట్లు, చిరు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు స్థానిక ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి