Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేరాల అదుపుకు, ప్రమాదాల నివారణకు ప్రణాళికతో పోలీసు కృషి. - ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు. అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 07:26 PM

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు.ఎస్‌ఐ గోపతి సతీష్

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు.ఎస్‌ఐ గోపతి సతీష్

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు.ఎస్‌ఐ గోపతి సతీష్
27-08-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ గోపతి సతీష్ హెచ్చరించారు. రాఖీ పండుగ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోలీస్‌స్టేషన్‌లో రాఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐతోపాటు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసుశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎవరైనా వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, సోషల్‌ మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదని, బాధితులకు పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. ఆడపిల్లల రక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు.

కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు మహేష్, శ్రావ్య, అనూష, పల్లవి, మానస, నవదీప్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు.ఎస్‌ఐ గోపతి సతీష్

Article Image

ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్‌ఐ గోపతి సతీష్ హెచ్చరించారు. రాఖీ పండుగ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోలీస్‌స్టేషన్‌లో రాఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐతోపాటు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసుశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎవరైనా వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, సోషల్‌ మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదని, బాధితులకు పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్‌ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. ఆడపిల్లల రక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు.

కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్‌కుమార్, జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు మహేష్, శ్రావ్య, అనూష, పల్లవి, మానస, నవదీప్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News