ఆడపిల్లలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని రామన్నపేట ఎస్ఐ గోపతి సతీష్ హెచ్చరించారు. రాఖీ పండుగ సందర్భంగా ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం పోలీస్స్టేషన్లో రాఖీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐతోపాటు పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి ఆడపిల్లలకు రక్షణ కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. మహిళలు, విద్యార్థినుల భద్రతకు పోలీసుశాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఎవరైనా వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, సోషల్ మీడియా ద్వారా ఇబ్బందులకు గురిచేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఫిర్యాదు చేసేందుకు భయపడాల్సిన అవసరం లేదని, బాధితులకు పోలీసులు అండగా ఉంటారని తెలిపారు. విద్యార్థినులు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాను బాధ్యతగా వినియోగించాలని సూచించారు. ఆడపిల్లల రక్షణ కోసం ఎస్ఎఫ్ఐ చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు.
కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి పుట్టల ఉదయ్కుమార్, జిల్లా కమిటీ సభ్యురాలు పెద్ది అక్షిత, మండల నాయకులు మహేష్, శ్రావ్య, అనూష, పల్లవి, మానస, నవదీప్, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి