Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 09:26 AM

డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి.. మహిళ అదృశ్యం

డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి.. మహిళ అదృశ్యం

డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి.. మహిళ అదృశ్యం
27-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి: డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట నేతాజీనగర్‌కు చెందిన కలాల్‌ భవానీ (26) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 25న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె రాత్రయినా తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో భర్త బోల్గాం నరేష్‌గౌడ్‌ చుట్టుపక్కల, బంధువుల వద్ద విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భవానీ ఇంటి నుంచి వెళ్లే సమయంలో గ్రే రంగు షర్ట్‌, గ్రీన్‌ రంగు జీన్స్‌ ప్యాంట్‌ ధరించినట్లు పోలీసులు తెలిపారు.

Sthanikam

డ్యూటీకి వెళ్తున్నానని వెళ్లి.. మహిళ అదృశ్యం

Article Image

చైతన్యపురి: డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం.. చంపాపేట నేతాజీనగర్‌కు చెందిన కలాల్‌ భవానీ (26) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. ఈ నెల 25న ఉదయం డ్యూటీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె రాత్రయినా తిరిగి రాలేదు. ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ రావడంతో భర్త బోల్గాం నరేష్‌గౌడ్‌ చుట్టుపక్కల, బంధువుల వద్ద విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. భవానీ ఇంటి నుంచి వెళ్లే సమయంలో గ్రే రంగు షర్ట్‌, గ్రీన్‌ రంగు జీన్స్‌ ప్యాంట్‌ ధరించినట్లు పోలీసులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News