కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిసి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్యం, అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యశాలలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వైద్యులను కోరారు. క్షతగాత్రుల చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటన ఎంతో విషాదకరమని, ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆకాంక్షించారు.
దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Harish reporter
కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిసి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్యం, అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యశాలలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వైద్యులను కోరారు. క్షతగాత్రుల చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటన ఎంతో విషాదకరమని, ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆకాంక్షించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి