Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:36 PM

దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
26-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిసి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్యం, అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యశాలలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వైద్యులను కోరారు. క్షతగాత్రుల చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటన ఎంతో విషాదకరమని, ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆకాంక్షించారు.

Sthanikam

దొరకుంట గ్రామ సమీపంలో ఘోర బస్సు ప్రమాదం – క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

Article Image

కోదాడ మండలం దొరకుంట గ్రామ సమీపంలో బుధవారం జరిగిన ఘోర బస్సు రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారని తెలిసి కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను స్వయంగా పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి ప్రమాదంలో గాయపడిన వారికి ఎలాంటి జాప్యం లేకుండా మెరుగైన వైద్యం, అత్యవసర చికిత్స అందించాలని సూచించారు. తీవ్రంగా గాయపడిన వారికి అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని, అవసరమైతే మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్యశాలలకు తరలించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని వైద్యులను కోరారు. క్షతగాత్రుల చికిత్స విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.ఈ దుర్ఘటన ఎంతో విషాదకరమని, ప్రమాదంలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లం మల్లయ్య యాదవ్ ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News