తెలంగాణ రాష్ట్ర
అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్రానికి మూడు బుల్లెట్ ట్రైన్ కేటాయించి తెలంగాణని వాణిజ్యపరంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోటి కేంద్రం ఆలోచిస్తే రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై మొదటి రెండవ అలైన్మెంట్లను పక్కనపెట్టి ప్రభుత్వం కేబినెట్లో తీర్మానం చేసి మూడవ అలైన్మెంట్ ను సిద్ధం చేసిందని కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా మూడవ అలైన్మెంట్ అంగీకరించలేదని సర్పంచి మలేపాక సాయి బాబా అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...మొదటి అలైన్మెంట్ ప్రకారం హైవే నెంబర్ 65 కి అనుబంధంగా సూర్యాపేట జిల్లా కేంద్రానికి బుల్లెట్ ట్రైన్ వచ్చే విధంగా సంకినేని నాయకత్వంలో కేంద్ర పెద్దలని విజ్ఞప్తి చేసి బుల్లెట్ ట్రైన్ సూర్యాపేటకు సాధించేంతవరకు అన్ని వర్గాలు ప్రజలు ప్రజా సంఘాలు వివిధ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ ఆమోదించిన మూడవ అలైన్మెంట్ రద్దుచేసి మొదటి అలైన్మెంట్ ప్రకారం సూర్యాపేట నుండి బుల్లెట్ ట్రైన్ వెళ్లే విధంగా అందరూ కలిసి ఉద్యమించాలని కోరారు. జిల్లా కేంద్ర అభివృద్ధికి తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధికి రవాణా వ్యాపార అభివృద్ధి కూడా సూర్యాపేట నుండి బుల్లెట్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సూర్యాపేట జిల్లా అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు నారాయణదాసు, నాగరాజు ,సీనియర్ నాయకులు ఉప్పుల లింగయ్య , కొండ రవి, ఉప్పుల వెంకన్న, పోడేటి సాయి కృష్ణ, లింగమల్లు, తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి