తుంగతుర్తి ;సాయుధ తెలంగాణ రైతాంగ పోరాట ఫలితమే ల్యాండ్ సీలింగ్ చట్టం ఈ చట్టం ద్వారా ఈరోజు నూతనకల్లులో రైతులకు భూమి పట్టాలను రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగిందని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు అనేక సంవత్సరాల నుండి ఈ ప్రాంతంలో ఉన్న సిపిఎం పార్టీ అగ్ర నాయకులు భీమ్ రెడ్డి నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం మల్లు వెంకట నరసింహారెడ్డి తొట్ల మన్సూర్ లాంటి మహనీయులు ఎర్రవాడు దొరల వద్ద ఉన్న భూములను పేదలకు పంచాలని ఎన్నో పోరాటాలు చేశారని ఆ పోరాటాలకు ప్రజల మద్దతు కూడగొట్టుకొని అనేకసార్లు కలెక్టరేట్ వద్ద ధర్నాలు తాసిల్దార్ ఆఫీసుల ముందు ఆందోళనలు చేయడం జరిగింది ఎర్రబాడు మిరియాల పోలుమల్ల ఈ ప్రాంతంలో ఉన్న దేవాలయ భూములు దొరల భూములు పేదలకు పంచాలని అనేకసార్లు ఆ భూములపై నాగండ్లు దున్నిభూ పోరాటాలు కొనసాగించామని ఈ పోరాటాలలో అనేకమంది సిపిఎం నాయకులు జైలుకు కూడా వెళ్లారని అనేక సంవత్సరాలు కోర్టుకు చుట్టూ తిరిగి అలిసిపోయారని అన్నారు అనేక ప్రభుత్వాలు వచ్చినా రైతులకు పట్టాలు వంచలేదని ఈ ప్రభుత్వం అయినా స్పందించి రైతులకు పట్టాలు ఇవ్వడం సంతోషకరమని ఆయన ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పారు తుంగతుర్తి ప్రాంతం కమ్యూనిస్టులకు కంచుకోటగా నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఆదర్శంగా తీసుకొని ఈ ప్రాంతంలో ఇంతకుముందే లక్షల ఎకరాల భూములు పంచిందని ఇంకా అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొరల వద్ద ఉన్న భూములను పేదలకు పని చేయడం కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఘనత ఈ సిపిఎం పార్టీకే ఉన్నదని ఆయన అన్నారు ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే మా పోరాటాల ద్వారా ఎప్పటికైనా అమలు చేయక తప్పదని వారు హెచ్చరించారు నాటి పోరాటం నుండి నీటి వరకు ఇండ్ల స్థలాల కోసం గానీ పేద ప్రజలకు ఇల్లు కట్టించాలని మిగులు భూములను పంచి పేదలకు ఇవ్వాలని ఇప్పటికీ అనేక రకాల పోరాటాలు కొనసాగించే దాంట్లో సిపిఎం పార్టీ ముందు ఉంటుందని ఆయన అన్నారు
ప్రభుత్వం ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి గిట్టుబాటు ధర అందించాలని స్వామినాథన్ కమిషన్ ప్రకారం పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని నేడు విపరీతంగా పెంచిన ఎరువుల తలను తగ్గించాలని విత్తన చట్టాన్ని తీసేసి విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులను మోసం చేయాలని దృక్పధనాన్ని వెనుకకు తీసుకోవాలని ఆయన కోరారు సిపిఎం పార్టీ నిరంతరం ఈ సమాజ శ్రేయస్సు కోసం అంతరాలు లేని సమాజం కోసం దోపిడీ లేని రాజ్యం కోసం ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుందని మా పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు
ఈరోజు తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలోని పెన్షనర్ ఫంక్షన్ హాల్ లో తుంగతుర్తి నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా వచ్చి మాట్లాడడం జరిగింది
ఈ సమావేశంలో సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొలిశెట్టి యాదగిరిరావు జిల్లా కమిటీ సభ్యులు బుర్ర శ్రీనివాసు కందాల శంకర్ రెడ్డి మండల కార్యదర్శిలు వజ్జే శ్రీనివాసు పోలోజు సైదులు దేవరకొండ యాదగిరి మరియు పార్టీ నాయకులు తాటి విజయమ్మ పళ్ళ సుదర్శన్ బూర్గుల ప్రభాకర్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి కూసు సైదులు గుడిపూడి వెంకటేశ్వర్లు శివ వెంకన్న భాస్కర్ అవిలయ్య తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి