Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మానవత్వం చాటుకున్న మాజీ సర్పంచ్.. బాధిత కుటుంబానికి సాయం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 07:52 PM

బట్టలు ఆరవేయడానికి వెళ్లి.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

బట్టలు ఆరవేయడానికి వెళ్లి.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

బట్టలు ఆరవేయడానికి వెళ్లి.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి
29-08-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పట్నం లావణ్య (30) బట్టలను ఉతికి ఆరవేయడానికి ఇంటి పక్కనే ఉన్న పశువుల షెడ్డు వద్దకు వెళ్ళింది.బట్టలు ఆరవేసుకోవడానికి పశువుల షెడ్డు కు ఉన్న సిమెంట్ స్తంభాలకు ఇనుప వైరుతో దండెమును ఏర్పాటు చేసుకున్నారు. పశువుల షెడ్డు లో వెలుతురు కోసమని ఇంట్లో నుండి వైర్ ద్వారా కరెంట్ తీసుకోవడం జరిగింది. విద్యుత్ వైరు తేలి దండెముకు తాకడాన్ని గుర్తించని లావణ్య బట్టలు ఆరవేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ప్రాంతంలో కాపాడడానికి ఎవరూ లేకపోవడంతో విద్యుత్ షాక్ కు బలైంది. మృతురాలు లావణ్య కు కొడుకు (12), కూతురు(8) ఉన్నారు. లావణ్య మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Sthanikam

బట్టలు ఆరవేయడానికి వెళ్లి.. విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

Article Image

బట్టలు ఆరవేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన పట్నం లావణ్య (30) బట్టలను ఉతికి ఆరవేయడానికి ఇంటి పక్కనే ఉన్న పశువుల షెడ్డు వద్దకు వెళ్ళింది.బట్టలు ఆరవేసుకోవడానికి పశువుల షెడ్డు కు ఉన్న సిమెంట్ స్తంభాలకు ఇనుప వైరుతో దండెమును ఏర్పాటు చేసుకున్నారు. పశువుల షెడ్డు లో వెలుతురు కోసమని ఇంట్లో నుండి వైర్ ద్వారా కరెంట్ తీసుకోవడం జరిగింది. విద్యుత్ వైరు తేలి దండెముకు తాకడాన్ని గుర్తించని లావణ్య బట్టలు ఆరవేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఆ ప్రాంతంలో కాపాడడానికి ఎవరూ లేకపోవడంతో విద్యుత్ షాక్ కు బలైంది. మృతురాలు లావణ్య కు కొడుకు (12), కూతురు(8) ఉన్నారు. లావణ్య మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News