ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం రామ్ల తండాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా వాంకుడోతు సరిత–మోతిరాం దంపతులు నిర్మించుకున్న నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామ సర్పంచ్ వాంకుడోతు హాథిరామ్, ఉప సర్పంచ్ జాటోత్ శాంతితో కలిసి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
నూతన గృహంలోకి అడుగుపెట్టిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఇంటిలో సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమం, పేదల అభ్యున్నతే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి