యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఎన్నికయ్యారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మన్మథ కుమార్ మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం సభ్యులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, శాఖ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐ మన్మథ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
PRINT TIME: August 30, 2026 09:54 AM
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఘన విజయం: జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఎన్నిక
30-08-2026
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
యాదాద్రి భువనగిరి జిల్లా పోలీస్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా చౌటుప్పల్ సీఐ మన్మథ కుమార్ ఎన్నికయ్యారు. భువనగిరి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. ఈ మేరకు ఎన్నికల ధ్రువపత్రాన్ని అడిషనల్ డీఎస్పీ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మన్మథ కుమార్ మాట్లాడుతూ.. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పోలీస్ అధికారుల సంఘం సభ్యులతో నిరంతరం సమన్వయం పాటిస్తూ, శాఖ సంక్షేమానికి శాయశక్తులా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సీఐ మన్మథ కుమార్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం పట్ల చౌటుప్పల్ మండలం, మున్సిపాలిటీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి