ధ్యాన్చంద్ సేవలు చిరస్మరణీయం: ప్రిన్సిపాల్ నవనీత
స్థానిక నారాయణ హైస్కూల్లో భారత హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్చంద్ జయంతి (జాతీయ క్రీడా దినోత్సవం) వేడుకలను శనివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ నవనీత ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రిన్సిపాల్ నవనీత మాట్లాడుతూ... మేజర్ ధ్యాన్చంద్ 1905 ఆగస్టు 29న అలహాబాద్లో జన్మించారని తెలిపారు. ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తూనే, లభించిన స్వల్ప సమయాన్నే సాధనకు ఉపయోగించుకుని హాకీలో అద్భుత ప్రతిభ కనబరిచారని కొనియాడారు. 1926లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికైన ఆయన, 1928 ఒలింపిక్స్ పోటీల్లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించి దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశారని గుర్తుచేశారు. క్రీడారంగానికి ఆయన చేసిన నిరుపమాన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా ప్రకారించిందని పేర్కొన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి క్రమశిక్షణ, శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఛాంప్స్ వైస్ ప్రిన్సిపాల్ క్రాంతి, ఈ-కిడ్స్ వైస్ ప్రిన్సిపాల్ మాధవి, హైస్కూల్ డీన్ వెంకన్న, ఏవో బాతరాజు వెంకటేశం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి