జిల్లాలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ సమీక్ష సమావేశంలో పాఠశాలల పనితీరు, విద్యార్థుల అభ్యసన స్థాయులు, మూల్యాంకన ఫలితాలను ఆయన సమీక్షించారు.జిల్లాలోని 254 ఎఫ్ఎల్ఎన్ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి నిర్దేశిత సామర్థ్యాలను సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మూల్యాంకన ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేలా ప్రత్యేక బోధనా చర్యలు చేపట్టాలని, ప్రతి మండలంలో ఆకస్మిక మూల్యాంకనాలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలని తెలిపారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా ఎఫ్ఎల్ఎన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, విద్యార్థుల అభ్యసన పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు నిర్దేశిత ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమా హారతి, జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి, జిల్లా సమగ్ర శిక్షణ కోఆర్డినేటర్ బాలయ్య, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్
Krishna
జిల్లాలో ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా పరిజ్ఞానం (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థి చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలను సాధించేలా ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. కలెక్టరేట్లో నిర్వహించిన ఎఫ్ఎల్ఎన్ సమీక్ష సమావేశంలో పాఠశాలల పనితీరు, విద్యార్థుల అభ్యసన స్థాయులు, మూల్యాంకన ఫలితాలను ఆయన సమీక్షించారు.జిల్లాలోని 254 ఎఫ్ఎల్ఎన్ పాఠశాలల్లో ప్రతి విద్యార్థి నిర్దేశిత సామర్థ్యాలను సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మూల్యాంకన ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన లోపాలను గుర్తించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. తెలుగు, ఇంగ్లీష్, గణితంలో ప్రాథమిక నైపుణ్యాలను పెంపొందించేలా ప్రత్యేక బోధనా చర్యలు చేపట్టాలని, ప్రతి మండలంలో ఆకస్మిక మూల్యాంకనాలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించాలని తెలిపారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశాల ద్వారా ఎఫ్ఎల్ఎన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించి, విద్యార్థుల అభ్యసన పురోగతిని తల్లిదండ్రులకు తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఈ విద్యా సంవత్సరం ముగిసేలోపు నిర్దేశిత ఎఫ్ఎల్ఎన్ లక్ష్యాలను సాధించేలా అధికారులు, ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. సమావేశంలో నారాయణఖేడ్ సబ్కలెక్టర్ ఉమా హారతి, జిల్లా విద్యాశాఖ అధికారిణి రోహిణి, జిల్లా సమగ్ర శిక్షణ కోఆర్డినేటర్ బాలయ్య, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, పర్యవేక్షణ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి