నల్గొండలో ప్రతిభకు పదును.. మహిళా క్రికెటర్ల ఎంపిక.
నల్గొండ పట్టణంలోని మేకల అభినయ స్టేడియంలో ఉమ్మడి నల్గొండ జిల్లాల మహిళా క్రికెట్ సెలక్షన్ ప్రక్రియ శనివారం నిర్వహించారు. నల్గొండ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సయ్యద్ ఆన్ ఉద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికల్లో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన మహిళా క్రికెటర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా క్రీడాకారిణులు తమ ప్రతిభను చాటుకునేందుకు ఉత్సాహంగా పోటీపడ్డారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఆటతీరును పరిశీలించిన సెలక్షన్ కమిటీ సభ్యులు ప్రతిభావంతులైన క్రీడాకారిణులను ఎంపిక చేశారు.కార్యక్రమంలో ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ హెడ్ సునీత ఆనంద్, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అడ్మిన్ ఫణీంద్ర, ఉమెన్స్ క్రికెట్ ఆపరేషన్ కమిటీ సభ్యురాలు అన్న మరియ, వాలంటీర్ శ్రావణి పాల్గొన్నారు.సెలక్షన్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణుల పేర్లను తదుపరి ప్రకటిస్తామని నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి