ఆత్మకూర్(ఎస్): మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అనిత గార్డెన్ను ఘనంగా ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు రామావత్ శేఖర్–అనిత దంపతుల కుమారుడు, కుమార్తె నూతన పట్టు వస్త్రాలంకరణ మహోత్సవానికి ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టు వస్త్రాలు ధరించిన చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన సర్వోత్తమ్ రెడ్డి వారిని ఆశీర్వదించారు. చిన్నారులు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లుతూ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, బంధుమిత్రులు పాల్గొని చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి