కుమ్మరులు సంఘటితంగా ముందుకు సాగాలి: తాడూరు చంద్రం.
చిన్నకాపర్తి:
శ్రావణ మాసం సందర్భంగా చిన్నకాపర్తి గ్రామంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాల కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.కార్యక్రమానికి కుమ్మర సంఘం జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తాడూరు చంద్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకునేందుకు ముందుకు సాగాలని సూచించారు. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
బోనాల సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.స్థానిక సర్పంచ్ ఆవుల సుందర్ కార్యక్రమానికి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ గంగాపురం భాస్కర్, వార్డు సభ్యులు, కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు పాకల దినేష్, ఉపాధ్యక్షులు ఆరూరి శ్రీను, ఆరూరి నరసింహ, చిన్నకాపర్తి, పాకాల గ్రామాలకు చెందిన కుమ్మర వంశస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి