Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనిల్ గోండాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 08:12 PM

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం
30-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

కుమ్మరులు సంఘటితంగా ముందుకు సాగాలి: తాడూరు చంద్రం.


చిన్నకాపర్తి:

శ్రావణ మాసం సందర్భంగా చిన్నకాపర్తి గ్రామంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాల కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.కార్యక్రమానికి కుమ్మర సంఘం జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ తాడూరు చంద్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకునేందుకు ముందుకు సాగాలని సూచించారు. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బోనాల సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.స్థానిక సర్పంచ్‌ ఆవుల సుందర్ కార్యక్రమానికి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ గంగాపురం భాస్కర్, వార్డు సభ్యులు, కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు పాకల దినేష్, ఉపాధ్యక్షులు ఆరూరి శ్రీను, ఆరూరి నరసింహ, చిన్నకాపర్తి, పాకాల గ్రామాలకు చెందిన కుమ్మర వంశస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

ఐక్యంగా ఉంటేనే సమస్యలకు పరిష్కారం

Article Image

కుమ్మరులు సంఘటితంగా ముందుకు సాగాలి: తాడూరు చంద్రం.


చిన్నకాపర్తి:

శ్రావణ మాసం సందర్భంగా చిన్నకాపర్తి గ్రామంలో కుమ్మర సంఘం ఆధ్వర్యంలో తొలి బోనాల కార్యక్రమాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు.కార్యక్రమానికి కుమ్మర సంఘం జిల్లా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ తాడూరు చంద్రం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుమ్మరులు ఐక్యంగా ఉండి తమ సమస్యలను సమష్టిగా పరిష్కరించుకునేందుకు ముందుకు సాగాలని సూచించారు. వృత్తిపరంగా ఎదురయ్యే సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

బోనాల సందర్భంగా వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలు బాగా పండి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు.స్థానిక సర్పంచ్‌ ఆవుల సుందర్ కార్యక్రమానికి హాజరై కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్‌ గంగాపురం భాస్కర్, వార్డు సభ్యులు, కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు పాకల దినేష్, ఉపాధ్యక్షులు ఆరూరి శ్రీను, ఆరూరి నరసింహ, చిన్నకాపర్తి, పాకాల గ్రామాలకు చెందిన కుమ్మర వంశస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News