చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో 3 కి.మీ మేర ట్రాఫిక్ జామ్.
హైదరాబాద్ బాట పట్టిన వాహనాలతో కిక్కిరిసిన జాతీయ రహదారి.. రంగంలోకి పోలీసులు, ఎన్హెచ్ఏఐ సిబ్బంది.
చిట్యాల: రాఖీ పండుగ ముగించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన వాహనాలతో చిట్యాల–చౌటుప్పల్ మార్గంలో ఆదివారం భారీగా ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. దీనికి తోడు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతుండటంతో వాహనాల రాకపోకలు మరింత మందగించాయి.విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో సుమారు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్హెచ్ఏఐ సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్రమబద్ధీకరిస్తున్నారు. వాహనాలను క్రమంగా ముందుకు పంపిస్తూ రద్దీని క్లియర్ చేసే చర్యలు చేపట్టారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి