Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 01:58 PM

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అఖిలపక్ష పోరాటం

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అఖిలపక్ష పోరాటం

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అఖిలపక్ష పోరాటం
31-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం

హైదరాబాద్‌: తెలంగాణలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును అమలు చేయాలని కోరుతూ బుల్లెట్‌ ట్రైన్‌ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

శంషాబాద్‌–నల్గొండ–సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాన్ని ఏర్పాటు చేయడంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం తదితర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు సాధనకు సహకరించాలని మహేశ్వర్‌రెడ్డిని కోరారు. బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

Sthanikam

బుల్లెట్‌ ట్రైన్‌ కోసం అఖిలపక్ష పోరాటం

Article Image

బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డికి వినతిపత్రం

హైదరాబాద్‌: తెలంగాణలో బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టును అమలు చేయాలని కోరుతూ బుల్లెట్‌ ట్రైన్‌ సాధన అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ మహేశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

శంషాబాద్‌–నల్గొండ–సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ మార్గాన్ని ఏర్పాటు చేయడంతో ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం తదితర ప్రాంతాలకు ప్రయోజనం చేకూరుతుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రాజెక్టు సాధనకు సహకరించాలని మహేశ్వర్‌రెడ్డిని కోరారు. బుల్లెట్‌ ట్రైన్‌ ఏర్పాటు వల్ల ఈ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు పారిశ్రామిక, వాణిజ్య, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వారు పేర్కొన్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కమిటీ ప్రతినిధులు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News