Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
టీఎంజేఎఫ్ మూడవ రాష్ట్ర మహాసభలకు కరపత్రికల ఆవిష్కరణ. ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 01:47 AM

పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సట్టు సైదులు...

పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సట్టు సైదులు...

పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సట్టు సైదులు...
31-08-2026 141 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సట్టు సైదులు...

9 ఓట్ల మెజార్టీతో రాంబాబుపై విజయం...

జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను కలసిన విజేతలు శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ...

నల్గొండ: నల్లగొండ జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా సట్టు సైదులు ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి రాంబాబుపై 9 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఏఆర్‌ విభాగం నుంచి 13 మంది, సివిల్ విభాగం నుంచి 30 మంది చొప్పున వేర్వేరు సర్కిళ్ల నుంచి మొత్తం 49 మంది ప్రతినిధులు ఎన్నికయ్యారు. ఆయా స్టేషన్ల నుంచి ఎన్నికైన ఈ ప్రతినిధులను ఓటర్లుగా పరిగణించి, 13 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకునేందుకు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.

సట్టు సైదులు ప్యానెల్ హవా...

ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సట్టు సైదులు, రాంబాబు ఇద్దరూ రెండు వేర్వేరు ప్యానెళ్లుగా ఏర్పడి బరిలోకి దిగారు. నిర్వహించిన పోలింగ్‌లో మొత్తం 49 ఓట్లకు గాను సట్టు సైదులు ప్యానెల్‌కు 29 ఓట్లు రాగా, రాంబాబు ప్యానెల్‌కు 20 ఓట్లు వచ్చాయి. దీంతో సట్టు సైదులు 9 ఓట్ల మెజార్టీతో అధ్యక్షుడిగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.

నూతన కార్యవర్గ సభ్యులు వీరే...

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గంలో ఇతర కీలక పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా/మెజార్టీతో ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి గా పసుపులేటి బాలకృష్ణ, కోశాధికారిగా  కాశిరెడ్డి సత్యనారాయణ,​ఉపాధ్యక్షులు గా ఇరిగి రవి, కరుణాకర్, ​సంయుక్త కార్యదర్శి గా కోటా సాయిరాం, కార్యనిర్వాహక కార్యదర్శి చిన్నపంగు వినోద్,  కార్యవర్గ సభ్యులుగా  అజ్మీర్ రమేష్, నాగజ్యోతి, భాస్కర్, అలకుంట్ల సుధాకర్, దాచు శ్రీహరి, వెంకన్న ఎన్నికయ్యారు. మిగిలిన రెండు కో-ఆప్షన్ సభ్యుల ఎంపికను త్వరలో జరగబోయే సంఘం తొలి సమావేశంలో చేపడతామని ప్రతినిధులు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నూతనంగా ఎన్నికైన పోలీస్ అధికారుల సంఘం కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడితో పాటు ప్యానెల్ సభ్యులందరికీ ఎస్పీ పూలగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.


Sthanikam

పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సట్టు సైదులు...

Article Image

పోలీస్‌ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సట్టు సైదులు...

9 ఓట్ల మెజార్టీతో రాంబాబుపై విజయం...

జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను కలసిన విజేతలు శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ...

నల్గొండ: నల్లగొండ జిల్లా పోలీస్‌ అధికారుల సంఘం నూతన అధ్యక్షుడిగా సట్టు సైదులు ఎన్నికయ్యారు. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థి రాంబాబుపై 9 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ప్రతినిధుల ఎన్నికలు నిర్వహించారు. ఇందులో ఏఆర్‌ విభాగం నుంచి 13 మంది, సివిల్ విభాగం నుంచి 30 మంది చొప్పున వేర్వేరు సర్కిళ్ల నుంచి మొత్తం 49 మంది ప్రతినిధులు ఎన్నికయ్యారు. ఆయా స్టేషన్ల నుంచి ఎన్నికైన ఈ ప్రతినిధులను ఓటర్లుగా పరిగణించి, 13 మందితో కూడిన నూతన కమిటీని ఎన్నుకునేందుకు సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రక్రియ చేపట్టారు.

సట్టు సైదులు ప్యానెల్ హవా...

ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సట్టు సైదులు, రాంబాబు ఇద్దరూ రెండు వేర్వేరు ప్యానెళ్లుగా ఏర్పడి బరిలోకి దిగారు. నిర్వహించిన పోలింగ్‌లో మొత్తం 49 ఓట్లకు గాను సట్టు సైదులు ప్యానెల్‌కు 29 ఓట్లు రాగా, రాంబాబు ప్యానెల్‌కు 20 ఓట్లు వచ్చాయి. దీంతో సట్టు సైదులు 9 ఓట్ల మెజార్టీతో అధ్యక్షుడిగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు అధికారికంగా వెల్లడించారు.

నూతన కార్యవర్గ సభ్యులు వీరే...

నల్లగొండ జిల్లా పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గంలో ఇతర కీలక పదవులకు సభ్యులు ఏకగ్రీవంగా/మెజార్టీతో ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శి గా పసుపులేటి బాలకృష్ణ, కోశాధికారిగా  కాశిరెడ్డి సత్యనారాయణ,​ఉపాధ్యక్షులు గా ఇరిగి రవి, కరుణాకర్, ​సంయుక్త కార్యదర్శి గా కోటా సాయిరాం, కార్యనిర్వాహక కార్యదర్శి చిన్నపంగు వినోద్,  కార్యవర్గ సభ్యులుగా  అజ్మీర్ రమేష్, నాగజ్యోతి, భాస్కర్, అలకుంట్ల సుధాకర్, దాచు శ్రీహరి, వెంకన్న ఎన్నికయ్యారు. మిగిలిన రెండు కో-ఆప్షన్ సభ్యుల ఎంపికను త్వరలో జరగబోయే సంఘం తొలి సమావేశంలో చేపడతామని ప్రతినిధులు తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం నూతనంగా ఎన్నికైన పోలీస్ అధికారుల సంఘం కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడితో పాటు ప్యానెల్ సభ్యులందరికీ ఎస్పీ పూలగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సిబ్బంది సంక్షేమం కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News