Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భద్రతకు ‘ఎల్ఐసీ’యే కొండంత అండ: వాసవి కన్‌స్ట్రక్షన్స్ ఎండీ విజయ్‌కుమార్ ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 07:37 PM

సైబర్ నేరగాళ్ల సైలెంట్ ట్రాప్... అవగాహనతోనే ఆన్‌లైన్ మోసాలకు చెక్!-సీఐ మన్మధకుమార్

సైబర్ నేరగాళ్ల సైలెంట్ ట్రాప్... అవగాహనతోనే ఆన్‌లైన్ మోసాలకు చెక్!-సీఐ మన్మధకుమార్

సైబర్ నేరగాళ్ల సైలెంట్ ట్రాప్... అవగాహనతోనే ఆన్‌లైన్ మోసాలకు చెక్!-సీఐ మన్మధకుమార్
01-09-2026 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆరెగూడెంలో చౌటుప్పల్ పోలీసుల ‘సైబర్ క్రైమ్ అవేర్‌నెస్’ సదస్సు

అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోవద్దని, ఆన్‌లైన్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి గోస పడొద్దని చౌటుప్పల్ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ హెచ్చరించారు. మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... సైబర్ క్రిమినల్స్ రోజుకో కొత్త రూపులో అమాయక ప్రజలను ముంచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, వాటిని అస్సలు క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ కాకుండా ఉండాలంటే OTP, PIN, CVV, UPI PIN వివరాలను పరాచకానికైనా ఎవరికీ చెప్పవద్దని సీఐ సూచించారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు ఇస్తామనే ఆశ చూపే ఇన్వెస్ట్‌మెంట్లు, లోన్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, లాటరీల పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దన్నారు. భయభ్రాంతులకు గురిచేసే 'డిజిటల్ అరెస్ట్' బెదిరింపులకు అస్సలు లొంగకూడదని ధైర్యం చెప్పారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని పిలుపునిచ్చారు. మోసపోయామని గ్రహించిన వెంటనే సెకన్ల వ్యవధిలో సైబర్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు మళ్లీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. లావాదేవీల ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

సైబర్ నేరగాళ్ల సైలెంట్ ట్రాప్... అవగాహనతోనే ఆన్‌లైన్ మోసాలకు చెక్!-సీఐ మన్మధకుమార్

Article Image

ఆరెగూడెంలో చౌటుప్పల్ పోలీసుల ‘సైబర్ క్రైమ్ అవేర్‌నెస్’ సదస్సు

అపరిచిత వ్యక్తుల చేతుల్లో మోసపోవద్దని, ఆన్‌లైన్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి గోస పడొద్దని చౌటుప్పల్ ఇన్స్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి. మన్మధ కుమార్ హెచ్చరించారు. మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామంలో చౌటుప్పల్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ కార్యక్రమం నిర్వహించారు. ​ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... సైబర్ క్రిమినల్స్ రోజుకో కొత్త రూపులో అమాయక ప్రజలను ముంచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజ్‌లు, అనుమానాస్పద లింకులతో డేంజర్ బెల్స్ మోగుతున్నాయని, వాటిని అస్సలు క్లిక్ చేయకూడదని స్పష్టం చేశారు. మీ బ్యాంక్ ఖాతాలు ఖాళీ కాకుండా ఉండాలంటే OTP, PIN, CVV, UPI PIN వివరాలను పరాచకానికైనా ఎవరికీ చెప్పవద్దని సీఐ సూచించారు. తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు ఇస్తామనే ఆశ చూపే ఇన్వెస్ట్‌మెంట్లు, లోన్లు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, లాటరీల పేరుతో వచ్చే మెసేజ్‌లను నమ్మొద్దన్నారు. భయభ్రాంతులకు గురిచేసే 'డిజిటల్ అరెస్ట్' బెదిరింపులకు అస్సలు లొంగకూడదని ధైర్యం చెప్పారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని పిలుపునిచ్చారు. మోసపోయామని గ్రహించిన వెంటనే సెకన్ల వ్యవధిలో సైబర్ హెల్ప్‌లైన్ 1930 నంబర్‌కు ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు మళ్లీ రికవరీ అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. లావాదేవీల ఆధారాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, గ్రామ సర్పంచ్, నాయకులు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News