ఎన్జీ కళాశాలలో నల్ల బ్యాడ్జీలతో పెన్షన్ విద్రోహ దినం.
నల్లగొండ: పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించడంతో పాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నాగార్జున ప్రభుత్వ కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది మంగళవారం నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. టీజీసీటీఏ పిలుపు మేరకు కళాశాల ప్రాంగణంలో శాంతియుతంగా పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించారు.
ఈ సందర్భంగా టీజీసీటీఏ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డా. ఎం. అనిల్ అబ్రహం మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయబద్ధమైన ఆకాంక్షలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలను కూడా తక్షణమే పరిష్కరించాలని కోరారు.
పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించకపోతే ఈ నెల 17న సామూహిక పోరాటానికి దిగుతామని ఆయన హెచ్చరించారు. తమ పోరాటానికి మద్దతు ప్రకటించిన ఓపీఎస్ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కార్యక్రమంలో అధ్యాపకులు డా. అనిల్ కుమార్, డా. మల్లేశం, డా. ఎం. శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, డా. జ్యోత్స్న, శివరాణి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి