నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో మూడో వార్డు సభ్యుడు మేడబోయిన విజయ నాగరాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో తొలి విడతలో దివంగత రామ్రెడ్డి దామోదర్రెడ్డి చొరవతో 3,500 ఇళ్లు మంజూరు కాగా, సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ వంటి పథకాలను అమలు చేసిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో వారిని బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గుడిసె రామకృష్ణ, ఉపసర్పంచ్ పల్లెటి వీరమ్మ వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ మేడబోయిన పుల్లయ్య, వార్డు సభ్యులు దాసరి లింగయ్య, పల్లెటి జనార్దన్, గ్రామ కాంగ్రెస్ ఇన్చార్జి పల్లెటి వీరబ్రహ్మం, గ్రామశాఖ అధ్యక్షుడు మామిడి యల్లయ్య, కోశాధికారి చింతల మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు రామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం
ఇందిరమ్మ ఇళ్లతో నిరుపేదల సొంతింటి కల సాకారం
Biksham
నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. చివ్వెంల మండలం ఉండ్రుగొండ గ్రామంలో మూడో వార్డు సభ్యుడు మేడబోయిన విజయ నాగరాజుకు మంజూరైన ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన పేదలకు సొంత ఇళ్లు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో తొలి విడతలో దివంగత రామ్రెడ్డి దామోదర్రెడ్డి చొరవతో 3,500 ఇళ్లు మంజూరు కాగా, సుమారు 70 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేయనున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ వంటి పథకాలను అమలు చేసిందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో వారిని బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ గుడిసె రామకృష్ణ, ఉపసర్పంచ్ పల్లెటి వీరమ్మ వెంకన్న, మాజీ ఉపసర్పంచ్ మేడబోయిన పుల్లయ్య, వార్డు సభ్యులు దాసరి లింగయ్య, పల్లెటి జనార్దన్, గ్రామ కాంగ్రెస్ ఇన్చార్జి పల్లెటి వీరబ్రహ్మం, గ్రామశాఖ అధ్యక్షుడు మామిడి యల్లయ్య, కోశాధికారి చింతల మురళి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండు రామ్మూర్తి, కాంగ్రెస్ నాయకులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, జిల్లా కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి