భద్రత, ట్రాఫిక్, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి.
గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మల్కాజిగిరి సీపీ సుమతి అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఉత్సవాలు నిర్వహించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.నాగోల్లోని పీఎంఆర్ కన్వెన్షన్లో సోమవారం రాత్రి సీపీ సుమతి ఆధ్వర్యంలో శాఖల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిమజ్జన ప్రాంతాల్లో క్రేన్లు, వైద్య శిబిరాలు, అగ్నిమాపక సిబ్బంది, అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
గణేష్ మండపాల నిర్వాహకులు ముందుగానే తమ వివరాలను పోలీసులకు అందించాలని అధికారులు కోరారు. మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన వైర్లు, పరికరాలు వినియోగించాలని, విద్యుత్, అగ్నిమాపక నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు.
నిమజ్జన ప్రాంతాలు, ప్రధాన రహదారులు, మండపాల వద్ద పారిశుద్ధ్య చర్యలు నిరంతరం కొనసాగించాలని నిర్ణయించారు. చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవడంతోపాటు ఉత్సవాల అనంతరం వ్యర్థాలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. నీటి సరఫరా, డ్రైనేజీ, రహదారుల నిర్వహణలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.సమావేశంలో ఎంఎంసీ అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, జోనల్ కమిషనర్లు రాధిక గుప్తా, సంచిత్ గంగ్వార్, వికాస్ మహతో, డీసీపీలు అనురాధ, సురేష్, ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి