Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
50 ఏళ్లకే పింఛన్ ఇవ్వాలి. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 04:27 PM

ప్రజా ఉద్యమాల నాయకుడు గాదెగాని మల్లయ్య

ప్రజా ఉద్యమాల నాయకుడు గాదెగాని మల్లయ్య

ప్రజా ఉద్యమాల నాయకుడు గాదెగాని మల్లయ్య
31-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూరు: ఆరెగూడెం గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ గాదెగాని మల్లయ్య 21వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ నల్ల ప్రదీప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మల్లయ్య స్తూపానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం, మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి మోటకొండూరు గ్రామపంచాయతీలో రెడ్డిగట్టి శేషయ్య నాయకత్వంలో రేగు సిద్ధయ్య, గాదెగాని మల్లయ్య, కొల్లూరు ఇస్తారి తదితరులతో కలిసి సర్వే నంబర్ 950లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంచడంలో మల్లయ్య కీలకంగా పనిచేశారని అన్నారు. గ్రామీణ ప్రజలకు అండగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించారని తెలిపారు.

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ.. ఉమ్మడి యాదగిరిగుట్ట మండలంలో మండల కౌన్సిల్‌గా పనిచేసిన మల్లయ్య, మోటకొండూరు గ్రామంలో నిరుపేదలు, భూమిలేని ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. భూమిలేని వారికి సాగు భూమి కోసం జరిగిన భూ పోరాటాల్లో ముందుండి పనిచేశారని తెలిపారు. ఆరెగూడెం గ్రామంలో పెత్తందారుల ఆధీనంలో ఉన్న గుడి, బడి స్థలాలను ప్రజా పోరాటం ద్వారా కాపాడిన నాయకుడు మల్లయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు, మండల కార్యవర్గ సభ్యులు బోల శ్రీనివాసు, పశువుల నరసింహ, మారబోయిన నరేష్, గాదగాని మల్లేష్, మారబోయిన హేమలేష్, మారబోయిన జహంగీర్, రేగు యాదయ్య, కొండ భీమయ్య, బీసా పాండు, పేరబోయిన రమేష్, మారబోయిన జాంగీర్, గాదెగాని నరసింహులు, నల్ల యుద్ధవరెడ్డి, జివిలికపల్లి పాండు, గాదెగాని కరుణాకర్, బీరకాయల మధు, బీసా నరసయ్య, గాదెగాని కార్తీక్, గాదగాని రాజు, కొల్లూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా ఉద్యమాల నాయకుడు గాదెగాని మల్లయ్య

Article Image

మోటకొండూరు: ఆరెగూడెం గ్రామంలో సీపీఐ గ్రామ శాఖ ఆధ్వర్యంలో కామ్రేడ్ గాదెగాని మల్లయ్య 21వ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ నల్ల ప్రదీప్‌రెడ్డి అధ్యక్షత వహించారు. మల్లయ్య స్తూపానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, పేరబోయిన మహేందర్, మండల కార్యదర్శి గాదగాని మాణిక్యం, మండల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా బోలగాని సత్యనారాయణ మాట్లాడుతూ.. ఉమ్మడి మోటకొండూరు గ్రామపంచాయతీలో రెడ్డిగట్టి శేషయ్య నాయకత్వంలో రేగు సిద్ధయ్య, గాదెగాని మల్లయ్య, కొల్లూరు ఇస్తారి తదితరులతో కలిసి సర్వే నంబర్ 950లో ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంచడంలో మల్లయ్య కీలకంగా పనిచేశారని అన్నారు. గ్రామీణ ప్రజలకు అండగా నిలిచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం ఉద్యమించారని తెలిపారు.

సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ మాట్లాడుతూ.. ఉమ్మడి యాదగిరిగుట్ట మండలంలో మండల కౌన్సిల్‌గా పనిచేసిన మల్లయ్య, మోటకొండూరు గ్రామంలో నిరుపేదలు, భూమిలేని ప్రజల కోసం అనేక పోరాటాలు చేశారని అన్నారు. భూమిలేని వారికి సాగు భూమి కోసం జరిగిన భూ పోరాటాల్లో ముందుండి పనిచేశారని తెలిపారు. ఆరెగూడెం గ్రామంలో పెత్తందారుల ఆధీనంలో ఉన్న గుడి, బడి స్థలాలను ప్రజా పోరాటం ద్వారా కాపాడిన నాయకుడు మల్లయ్య అని కొనియాడారు. ఆయన ఆశయాల సాధన కోసం ఉద్యమాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఆలేటి బాలరాజు, మండల కార్యవర్గ సభ్యులు బోల శ్రీనివాసు, పశువుల నరసింహ, మారబోయిన నరేష్, గాదగాని మల్లేష్, మారబోయిన హేమలేష్, మారబోయిన జహంగీర్, రేగు యాదయ్య, కొండ భీమయ్య, బీసా పాండు, పేరబోయిన రమేష్, మారబోయిన జాంగీర్, గాదెగాని నరసింహులు, నల్ల యుద్ధవరెడ్డి, జివిలికపల్లి పాండు, గాదెగాని కరుణాకర్, బీరకాయల మధు, బీసా నరసయ్య, గాదెగాని కార్తీక్, గాదగాని రాజు, కొల్లూరు స్వామి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News