హైదరాబాద్, సెప్టెంబరు 1:
రూ.10 వేల లంచం తీసుకుంటూ టోలిచౌకి పోలీస్స్టేషన్ ఎస్సై ఆర్. పాండు నాయక్ ఏసీబీకి పట్టుబడ్డారు. మంగళవారం సిటీ రేంజ్–1 ఏసీబీ అధికారులు వలపన్ని లంచం స్వీకరిస్తుండగా ఎస్సైను రెడ్హ్యాండెడ్గా అదుపులోకి తీసుకున్నారు.
తన తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా కుటుంబ సభ్యుల మధ్య సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తానని, ఫిర్యాదుదారుడి పాస్పోర్ట్ను స్వాధీనం చేసుకోకుండా ఉండేందుకు రూ.10 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు నగదును స్వాధీనం చేసుకున్నారు.
ప్రభుత్వ విధులను నిర్వర్తించడంలో అక్రమ ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించినట్లు ఏసీబీ పేర్కొంది. నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించింది. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
లంచం అడిగితే 1064కు ఫిర్యాదు
ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ఫ్రీ నంబర్ 1064కు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి