తుంగతుర్తి;
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి అన్ని వర్గాలను మోసం చేసిందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ సెప్టెంబర్ 2న తుంగతుర్తిలో నిర్వహించనున్న నియోజకవర్గస్థాయి నిరసన ధర్నాను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.తుంగతుర్తి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో సీతయ్య మాట్లాడుతూ.. అధికారం కోసం అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు.కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబీమా వంటి పథకాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మహిళలు, రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్, గుజ్జ దీపిక యుగంధర్రావు హాజరుకానున్నట్లు తెలిపారు.సమావేశంలో జిల్లా నాయకుడు గుండగాని రాములు గౌడ్, సర్పంచ్లు మేడదుల రమేష్, మాతంగి వెంకటమ్మ, కరుణాకర్, శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గుడిపాటి వీరయ్య, గోపగాని రమేష్, మల్లెపాక రాములు, మాజీ సర్పంచ్ విరోజీనాయక్, పూర్ణనాయక్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి