Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ సమరభేరి ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 08:44 PM

జ్వరంతో 20 రోజుల పసికందు మృతి.. కుటుంబంలో కన్నీరుమున్నీరు

జ్వరంతో 20 రోజుల పసికందు మృతి.. కుటుంబంలో కన్నీరుమున్నీరు

జ్వరంతో 20 రోజుల పసికందు మృతి.. కుటుంబంలో కన్నీరుమున్నీరు
01-09-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం రసోల్ గ్రామంలో 20 రోజుల పసికందు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సోమవారం బాబుకు జ్వరం రావడంతో తడ్కల్ గ్రామంలోని ఆర్‌ఎంపీ రాములు వద్ద చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం బాబు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాబు మృతి చెందినట్లు తెలిపారు.పసికందు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్‌ఎంపీ వద్ద చికిత్స అనంతరం బాబు ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. అయితే పసికందు మృతికి ఖచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. వైద్యుల పరిశీలన, అధికారుల విచారణ అనంతరం మృతికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

Sthanikam

జ్వరంతో 20 రోజుల పసికందు మృతి.. కుటుంబంలో కన్నీరుమున్నీరు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండలం రసోల్ గ్రామంలో 20 రోజుల పసికందు మృతి చెందడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం సోమవారం బాబుకు జ్వరం రావడంతో తడ్కల్ గ్రామంలోని ఆర్‌ఎంపీ రాములు వద్ద చికిత్స చేయించారు. అయినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో మంగళవారం ఉదయం బాబు పరిస్థితి విషమించింది. దీంతో కుటుంబ సభ్యులు కంగ్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బాబు మృతి చెందినట్లు తెలిపారు.పసికందు మృతితో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఆర్‌ఎంపీ వద్ద చికిత్స అనంతరం బాబు ఆరోగ్యం మరింత క్షీణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరిగిందా అనే అంశంపై అధికారులు విచారణ చేపట్టాలని కోరారు. అయితే పసికందు మృతికి ఖచ్చితమైన కారణం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. వైద్యుల పరిశీలన, అధికారుల విచారణ అనంతరం మృతికి అసలు కారణం స్పష్టమయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News