కేంద్ర పథకాలపై క్షేత్రస్థాయి పరిశీలన.
హైదరాబాద్, సెప్టెంబరు 1 స్థానికం ప్రతినిధి :
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఉత్తరాఖండ్కు చెందిన 15 మంది పాత్రికేయుల బృందం హైదరాబాద్లో పర్యటిస్తోంది. డెహ్రాడూన్ పీఐబీ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ సుంద్రియాల్ నేతృత్వంలోని బృందం ఆగస్టు 31న నగరానికి చేరుకుంది. సెప్టెంబరు 4 వరకు పర్యటన కొనసాగనుంది.పర్యటనలో భాగంగా తొలిరోజు హైదరాబాద్లోని పీఐబీ కార్యాలయంలో ఏజీడీ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్తో బృందం సమావేశమైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పీఐబీ, సీబీసీ నిర్వహిస్తున్న సమాచార కార్యక్రమాలను అధికారులు వివరించారు. తెలంగాణ పర్యటన అనుభవాలను ఉత్తరాఖండ్ ప్రజలకు తెలియజేయాలని శృతి పాటిల్ సూచించారు.
అనంతరం కేంద్ర భూవిజ్ఞాన మంత్రిత్వశాఖ పరిధిలోని ఇన్కాయిస్ను బృందం సందర్శించింది. సముద్ర పరిస్థితుల పర్యవేక్షణ, సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవస్థపై అధికారులు వివరించారు. పర్యటనలో భాగంగా ఎన్ఐఎన్, ఈఎస్ఐసీ ఆసుపత్రి, తెలంగాణ చేనేత–చేతివృత్తుల ప్రదర్శనలను కూడా బృందం సందర్శించనుంది.హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని తెలుసుకునేందుకు సాలార్జంగ్ మ్యూజియం, చార్మినార్, లాడ్బజార్ తదితర ప్రాంతాలను కూడా పాత్రికేయులు సందర్శించనున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి