తుంగతుర్తి;
వి.బి.జి. రాంజీ పథకం ద్వారా ఉపాధి కూలీలకు 125 రోజుల పనిదినాలు కల్పించేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని గ్రామ సర్పంచ్ చిలుకల మంజుల వెంకన్న అధికారులను కోరారు.మండల కేంద్రంలోని గొట్టిపర్తి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం వి.బి.జి. రాంజీ పథకంపై తొలి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... ఉపాధి కూలీలకు నిరంతరం పని కల్పించేందుకు అవసరమైన పనులను అధికారులు ముందుగానే గుర్తించాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ఉపాధి కూలీలు ప్రభుత్వం కల్పిస్తున్న 125 రోజుల పనిదినాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కరుణ, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి