విదేశీ విద్యా విధానాలపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పించేందుకు తెలంగాణ విద్యాశాఖ చేపట్టిన అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు కోదాడ ఉపాధ్యాయుడు చారుగుండ్ల రాజశేఖర్ ఎంపికయ్యారు. సెప్టెంబర్ 5 నుండి 12 వరకు జపాన్లో జరిగే అంతర్జాతీయ విద్యా పరిశీలన పర్యటనలో ఆయన పాల్గొననున్నారు.
రాజశేఖర్ ఈ అరుదైన అవకాశాన్ని సాధించడం పట్ల మంగళవారం కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్మన్ దేవరపల్లి మల్లేశ్వరి హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. అంతర్జాతీయ స్థాయి విద్యాబోధన పద్ధతులు మన విద్యావ్యవస్థకు ఎంతో మేలు చేస్తాయని వారు పేర్కొన్నారు. విజయీభవ, స్వర్ణభారతి ట్రస్ట్లతో పాటు అవోపా సభ్యులు ఆయనకు అభినందనలు తెలియజేశారు......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి