అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో తనదైన ముద్ర వేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదలు, రైతులు, విద్యార్థుల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. సాగునీటి ప్రాజెక్టులు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి అభివృద్ధి పనులతో పాటు రైతుల రుణమాఫీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేశారని తెలిపారు. ప్రజల అవసరాలను గుర్తించి సంక్షేమ పాలన అందించిన వైఎస్సార్ సేవలు ఎప్పటికీ ప్రజల జ్ఞాపకాల్లో నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీలు అనిల్కుమార్ యాదవ్, డాక్టర్ మల్లు రవి, సురేష్ షెట్కార్, పోరిక బలరాం నాయక్ తదితరులు పాల్గొని వైఎస్సార్కు నివాళులర్పించారు.
.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి