హైదరాబాద్: తెలంగాణను గుడిసెల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతమ్ తెలిపారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియను వచ్చే నెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విడతలో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
27 నుంచి లాటరీ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు ఈ నెల 27 నుంచి లాటరీ నిర్వహించనున్నట్లు గౌతమ్ తెలిపారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున లాటరీ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా ఇళ్ల కేటాయింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి