శ్రీ సత్యసాయి జిల్లాలో వెట్టిచాకిరీకి గురవుతున్న మహారాష్ట్రకు చెందిన 40 మంది గిరిజన కార్మికులను జిల్లా టాస్క్ఫోర్స్ బృందాలు రక్షించాయి. కొత్తచెరువు, గోరంట్ల మండలాల్లో నిర్వహించిన దాడుల్లో 4 నెలల పసికందు నుంచి 63 ఏళ్ల వృద్ధుల వరకు బాధితులను గుర్తించారు.అప్పుల పేరుతో బొగ్గు భట్టీల్లో బంధించి వెట్టిచాకిరీ చేయిస్తున్నారన్న ఫిర్యాదుపై కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ ఆదేశాలతో అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు. బాధితులకు రిలీజ్ సర్టిఫికెట్లు, వైద్యం, ఆహారం, ఆర్థిక సాయం అందించి ప్రత్యేక వాహనాల్లో మహారాష్ట్రకు సురక్షితంగా తరలించారు.
బాధ్యులపై సంబంధిత చట్టాల కింద కేసులు నమోదు చేసి, అక్రమ రుణాలను రద్దు చేశారు. వెట్టిచాకిరీ, శ్రమదోపిడీపై జిల్లాలో నిరంతర తనిఖీలు కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి