Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొయ్యలగూడెంలో ఉచిత వైద్య శిబిరం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 07:17 PM

మైనారిటీ ఫంక్షన్ హాల్‌కు 10 గుంటల స్థలం.. రూ.10 లక్షల నిధులు

మైనారిటీ ఫంక్షన్ హాల్‌కు 10 గుంటల స్థలం.. రూ.10 లక్షల నిధులు

మైనారిటీ ఫంక్షన్ హాల్‌కు 10 గుంటల స్థలం.. రూ.10 లక్షల నిధులు
09-08-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో మైనారిటీ వర్గాల కోసం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 10 గుంటల స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన భూమి పత్రాలు, నిధుల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన నివాసంలో మైనారిటీ వర్గాల ప్రతినిధులకు అందజేశారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తయితే మైనారిటీ వర్గాల ప్రజలు వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని ప్రతినిధులు తెలిపారు. తమ అవసరాన్ని గుర్తించి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే. రాజు, కే. శ్రీనివాసరెడ్డి, పి. మనోజ్ పటేల్, గఫార్ సాబ్, పాషుమియా, జానీ సాబ్, మైతాబ్ అలీ, ఇస్మాయిల్ సాబ్, గౌసొద్దీన్, హాజీ మైనుద్దీన్, మహమ్మద్ సాబ్, మోయిన్, బోలెసాబ్, షేక్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మైనారిటీ ఫంక్షన్ హాల్‌కు 10 గుంటల స్థలం.. రూ.10 లక్షల నిధులు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల కేంద్రంలో మైనారిటీ వర్గాల కోసం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. ఫంక్షన్ హాల్ నిర్మాణానికి 10 గుంటల స్థలాన్ని కేటాయించడంతో పాటు రూ.10 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీనికి సంబంధించిన భూమి పత్రాలు, నిధుల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి తన నివాసంలో మైనారిటీ వర్గాల ప్రతినిధులకు అందజేశారు. ఫంక్షన్ హాల్ నిర్మాణం పూర్తయితే మైనారిటీ వర్గాల ప్రజలు వివాహాలు, శుభకార్యాలు, సమావేశాలు, ఇతర సామాజిక కార్యక్రమాలను సౌకర్యవంతంగా నిర్వహించుకునే అవకాశం కలుగుతుందని ప్రతినిధులు తెలిపారు. తమ అవసరాన్ని గుర్తించి స్థలం కేటాయించి, నిధులు మంజూరు చేయించిన ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కే. రాజు, కే. శ్రీనివాసరెడ్డి, పి. మనోజ్ పటేల్, గఫార్ సాబ్, పాషుమియా, జానీ సాబ్, మైతాబ్ అలీ, ఇస్మాయిల్ సాబ్, గౌసొద్దీన్, హాజీ మైనుద్దీన్, మహమ్మద్ సాబ్, మోయిన్, బోలెసాబ్, షేక్ జలీల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News