దేవలమ్మనాగారంలో ప్రహరీ, మరుగుదొడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్
గ్రామీణ ప్రాంతాల్లో విద్యాభివృద్ధికి, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నోషి పరిశ్రమ అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని దేవలమ్మనాగారం సర్పంచ్ సురుగు గౌరీ శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పరిశ్రమ యాజమాన్యం ఆర్థిక సహకారంతో మండల పరిధిలోని దేవలమ్మనాగారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించనున్న ప్రహరీ గోడ, విద్యార్థుల మరుగుదొడ్ల నిర్మాణ పనులకు శనివారం ఆమె శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధికి, బడి సంక్షేమానికి నోషి పరిశ్రమ నిరంతరం తోడ్పాటునందించడం సంతోషదాయకమని కొనియాడారు. విద్యార్థులు ఈ వసతులను సద్వినియోగం చేసుకుని బాగా చదువుకుని గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుర్కంటి అనూప్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొమ్మ మైసయ్య, వార్డు సభ్యులు ఊదరి రమేష్, బొమ్మ శ్వేత, బొమ్మ అమరావతి, ఫాతిమా, దోనూరి కిరణ్ రెడ్డి, గట్టు ప్రశాంత్, పాక రాము, సుంకరి శ్రీను, దేశట్ల చైతన్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి