రామన్న పేట మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ ఎదురుగా గ్రామానికి చెందిన చిప్పలపల్లి స్వామి నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ భవాని హోటల్ శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, యువకులు హోటల్ నిర్వాహకుడు చిప్పలపల్లి స్వామిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ముత్యాల సాయిలు, ముత్యాల రమేష్, చిప్పలపల్లి జితేందర్ మాట్లాడుతూ.. శ్రీ భవాని హోటల్ ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందిస్తూ మంచి ఆదరణ పొందాలని ఆకాంక్షించారు. వ్యాపారం విజయవంతంగా అభివృద్ధి చెంది నిర్వాహకులు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, స్థానికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి