Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీవారి ఆలయ పాలకవర్గ సభ్యుడిగా నల్లగాసు నవీన్ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 08, 2026 04:15 PM

బైక్‌ దొంగ అరెస్ట్‌.. రెండు వాహనాలు స్వాధీనం.

బైక్‌ దొంగ అరెస్ట్‌.. రెండు వాహనాలు స్వాధీనం.

బైక్‌ దొంగ అరెస్ట్‌.. రెండు వాహనాలు స్వాధీనం.
08-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండలో పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడు.


నల్గొండ: ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద హోండా షైన్‌ మోటార్‌సైకిల్‌ చోరీ కేసులో నిందితుడిని నల్గొండ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పానగల్‌ బైపాస్‌ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ చోరీ విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన స్కూటీ, మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండలో చోరీ చేసిన హోండా షైన్‌తో పాటు నెల్లూరులో చోరీ చేసిన స్కూటీని కూడా అతడి వద్ద నుంచి రికవరీ చేసినట్లు వెల్లడించారు.

ఇస్మాయిల్‌పై గతంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో బైక్‌ చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో అరెస్టై చర్లపల్లి జైలులో ఏడాది శిక్ష అనుభవించినప్పటికీ, జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ బైక్‌ చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

పోలీసుల అప్రమత్తతతో రెండు వాహనాలను స్వల్ప వ్యవధిలోనే రికవరీ చేయడం విశేషం. డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ కె. ఆది రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐలు డి. సైదాబాబు, జి. మానసతో పాటు పోలీసు సిబ్బంది బాలకోటి, షకీల్‌, సైదులు, మహేష్‌ కీలకంగావ్యవహరించారు.

నిందితుడిని పట్టుకుని వాహనాలను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


Sthanikam

బైక్‌ దొంగ అరెస్ట్‌.. రెండు వాహనాలు స్వాధీనం.

Article Image

నల్గొండలో పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడు.


నల్గొండ: ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద హోండా షైన్‌ మోటార్‌సైకిల్‌ చోరీ కేసులో నిందితుడిని నల్గొండ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పానగల్‌ బైపాస్‌ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన మహమ్మద్‌ ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్‌ చోరీ విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన స్కూటీ, మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండలో చోరీ చేసిన హోండా షైన్‌తో పాటు నెల్లూరులో చోరీ చేసిన స్కూటీని కూడా అతడి వద్ద నుంచి రికవరీ చేసినట్లు వెల్లడించారు.

ఇస్మాయిల్‌పై గతంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌, జీడిమెట్ల, షాపూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో బైక్‌ చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో అరెస్టై చర్లపల్లి జైలులో ఏడాది శిక్ష అనుభవించినప్పటికీ, జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ బైక్‌ చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.

పోలీసుల అప్రమత్తతతో రెండు వాహనాలను స్వల్ప వ్యవధిలోనే రికవరీ చేయడం విశేషం. డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ కె. ఆది రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఎస్‌ఐలు డి. సైదాబాబు, జి. మానసతో పాటు పోలీసు సిబ్బంది బాలకోటి, షకీల్‌, సైదులు, మహేష్‌ కీలకంగావ్యవహరించారు.

నిందితుడిని పట్టుకుని వాహనాలను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News