నల్గొండలో పోలీసుల వాహన తనిఖీల్లో పట్టుబడిన నిందితుడు.
నల్గొండ: ఆర్టీసీ బస్టాండ్ వద్ద హోండా షైన్ మోటార్సైకిల్ చోరీ కేసులో నిందితుడిని నల్గొండ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పానగల్ బైపాస్ రోడ్డులో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన విజయవాడ సత్యనారాయణపురానికి చెందిన మహమ్మద్ ఇస్మాయిల్ను అదుపులోకి తీసుకుని విచారించగా బైక్ చోరీ విషయం వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.నిందితుడి నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన స్కూటీ, మోటార్సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నల్గొండలో చోరీ చేసిన హోండా షైన్తో పాటు నెల్లూరులో చోరీ చేసిన స్కూటీని కూడా అతడి వద్ద నుంచి రికవరీ చేసినట్లు వెల్లడించారు.
ఇస్మాయిల్పై గతంలో హైదరాబాద్లోని ఎల్బీనగర్, జీడిమెట్ల, షాపూర్నగర్ పోలీస్స్టేషన్ల పరిధిలో బైక్ చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ కేసుల్లో అరెస్టై చర్లపల్లి జైలులో ఏడాది శిక్ష అనుభవించినప్పటికీ, జైలు నుంచి విడుదలైన అనంతరం మళ్లీ బైక్ చోరీలకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
పోలీసుల అప్రమత్తతతో రెండు వాహనాలను స్వల్ప వ్యవధిలోనే రికవరీ చేయడం విశేషం. డీఎస్పీ కె. శివరాం రెడ్డి పర్యవేక్షణలో, సీఐ కె. ఆది రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్లో ఎస్ఐలు డి. సైదాబాబు, జి. మానసతో పాటు పోలీసు సిబ్బంది బాలకోటి, షకీల్, సైదులు, మహేష్ కీలకంగావ్యవహరించారు.
నిందితుడిని పట్టుకుని వాహనాలను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి