Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 10:12 PM

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం
07-08-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు

మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటిచూపు సమస్యలతో బాధపడకూడదనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్' ద్వారా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ శంకర్ నేత్రాలయ వైద్య నిపుణుల భాగస్వామ్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత నేత్ర పరీక్షలు చేపడుతున్నారు. ​శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని త్రినిటీ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, పలువురికి తగు వైద్య సూచనలు అందజేశారు. శంకర్ నేత్రాలయ వైద్యులు డాక్టర్ కే. నవ్య, డాక్టర్ ఏ. మధు, డాక్టర్ ఏ. స్వప్న పాల్గొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.​ఈ సందర్భంగా త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల మాట్లాడుతూ.. అంధత్వ నివారణే ధ్యేయంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. విద్యార్థి దశలోనే కంటి సమస్యలను గుర్తించడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం

Article Image

సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు

మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటిచూపు సమస్యలతో బాధపడకూడదనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్' ద్వారా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ శంకర్ నేత్రాలయ వైద్య నిపుణుల భాగస్వామ్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత నేత్ర పరీక్షలు చేపడుతున్నారు. ​శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని త్రినిటీ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, పలువురికి తగు వైద్య సూచనలు అందజేశారు. శంకర్ నేత్రాలయ వైద్యులు డాక్టర్ కే. నవ్య, డాక్టర్ ఏ. మధు, డాక్టర్ ఏ. స్వప్న పాల్గొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.​ఈ సందర్భంగా త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల మాట్లాడుతూ.. అంధత్వ నివారణే ధ్యేయంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. విద్యార్థి దశలోనే కంటి సమస్యలను గుర్తించడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News