సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర పరీక్షలు
మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ కంటిచూపు సమస్యలతో బాధపడకూడదనే లక్ష్యంతో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో 'కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్' ద్వారా వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రసిద్ధ శంకర్ నేత్రాలయ వైద్య నిపుణుల భాగస్వామ్యంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉచిత నేత్ర పరీక్షలు చేపడుతున్నారు. శుక్రవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని త్రినిటీ విద్యాసంస్థల్లో విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి, పలువురికి తగు వైద్య సూచనలు అందజేశారు. శంకర్ నేత్రాలయ వైద్యులు డాక్టర్ కే. నవ్య, డాక్టర్ ఏ. మధు, డాక్టర్ ఏ. స్వప్న పాల్గొని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా త్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ కే.వి.బి. కృష్ణారావు, డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల మాట్లాడుతూ.. అంధత్వ నివారణే ధ్యేయంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అభినందనీయమని కొనియాడారు. విద్యార్థి దశలోనే కంటి సమస్యలను గుర్తించడం వల్ల వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి