ఎల్బీనగర్, ఆగస్టు 7
పేదలు, దివ్యాంగులకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేపట్టిన ఉద్యమాల ఫలితంగానే ఆరోగ్యశ్రీ పథకం అమలులోకి వచ్చిందని ఎమ్మార్పీఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గ ఇన్చార్జి బత్తిని సుధాకర్ మాదిగ పేర్కొన్నారు.
ఆరోగ్యశ్రీ పథకం అమలు దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఎల్బీనగర్లోని మహనీయుల విగ్రహాల వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా బత్తిని సుధాకర్ మాదిగ మాట్లాడుతూ, పేదలు, దివ్యాంగులకు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉచిత వైద్యసేవలు అందించాలనే డిమాండ్తో మంద కృష్ణ మాదిగ ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆ ఉద్యమాల ప్రభావంతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007 ఆగస్టు 7న ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించారని తెలిపారు.
ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వేలాది మంది నిరుపేదలు ఖరీదైన వైద్య చికిత్సలను ఉచితంగా పొందుతూ ప్రాణాలను కాపాడుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బీజేఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం. రాజు మాదిగ, గిరి మాదిగ, యాదయ్య మాదిగ, చంటి మాదిగ, క్రాంతి కుమార్ మాదిగ, హుస్సేన్ మాదిగ, రంగన్న మాదిగ, బీసీ నాయకులు భీమ్రావు, గోపిశివ, రాము మాదిగ, కాశీ మాదిగ, బుజ్జి మాదిగ, దేవా మాదిగ, పవన్ మాదిగ, చరణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి