శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం.. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా.
నల్గొండ జిల్లా చిట్యాల పోలీస్స్టేషన్ నూతన సబ్ఇన్స్పెక్టర్గా బీరెల్లి వెంకటరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు చిట్యాల ఎస్సైగా విధులు నిర్వహించిన మామిడి రవికుమార్ నల్గొండ జిల్లా పోలీసు కార్యాలయానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో వెంకటరెడ్డిని నియమిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎస్సై వెంకటరెడ్డి మాట్లాడుతూ చిట్యాల పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను సంప్రదించేందుకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. ప్రజలు చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు.
పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలు, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి