Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 10:46 PM

మూసీలో మిస్టరీ డెత్.. గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం.

మూసీలో మిస్టరీ డెత్.. గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం.

మూసీలో మిస్టరీ డెత్.. గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం.
07-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్ పరిధిలో ఘటన.. ఆత్మహత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు

చైతన్యపురి: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీనదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్, నాగోల్ సర్కిల్ పరిధిలోని గౌరెల్లి–ప్రతాప్ సింగారం మూసీ వంతెన సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మూసీ నది నుంచి వెలికితీశారు. మృతుడు సుమారు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకుడిగా ప్రాథమికంగా గుర్తించారు. అతడు నీలిరంగు జీన్స్ ప్యాంట్, గోధుమరంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఆత్మహత్యా? లేక మూసీ ప్రవాహంలో కొట్టుకువచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెక్టార్ ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

Sthanikam

మూసీలో మిస్టరీ డెత్.. గుర్తుతెలియని యువకుడి మృతదేహం కలకలం.

Article Image

నాగోల్ పరిధిలో ఘటన.. ఆత్మహత్యా? లేక ప్రమాదమా? అనే కోణంలో దర్యాప్తు

చైతన్యపురి: నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసీనదిలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎల్బీనగర్ జోన్, నాగోల్ సర్కిల్ పరిధిలోని గౌరెల్లి–ప్రతాప్ సింగారం మూసీ వంతెన సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతుండటాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న నాగోల్ పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మూసీ నది నుంచి వెలికితీశారు. మృతుడు సుమారు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన యువకుడిగా ప్రాథమికంగా గుర్తించారు. అతడు నీలిరంగు జీన్స్ ప్యాంట్, గోధుమరంగు షర్ట్ ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటన ఆత్మహత్యా? లేక మూసీ ప్రవాహంలో కొట్టుకువచ్చాడా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని, గుర్తింపు కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని సెక్టార్ ఎస్‌ఐ రమేష్ తెలిపారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News