Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్ గా బీరెల్లి వెంకటరెడ్డి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 09:40 PM

ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహించాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహించాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహించాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
07-08-2026 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో కలిసి పరిశీలన

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను నిర్వహించాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూచించారు. శుక్రవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కుడకుడ, బాలాజీ నగర్, శ్రీరాం నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేసిన వినతిని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అడ్డా కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

పాఠశాలల ప్రారంభ సమయంలో ట్రాఫిక్ రద్దీ, విద్యార్థుల భద్రత, ప్రజల రాకపోకలు, అడ్డా కూలీల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఉదయం 9 గంటల తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను నిర్వహిస్తే రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.

కొత్త బస్టాండ్ ఎదుట ఉన్న అడ్డా కూలీల స్థలాన్ని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కుడకుడ రోడ్డు వైపు కొంత దూరానికి మార్చే అవకాశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు అడ్డా కూలీలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు.

Sthanikam

ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహించాలి: రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి

Article Image

కొత్త బస్టాండ్ వద్ద ట్రాఫిక్ ఏర్పాట్లపై పోలీసు అధికారులతో కలిసి పరిశీలన

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ సిగ్నల్స్‌ను నిర్వహించాలని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి సూచించారు. శుక్రవారం సూర్యాపేట కొత్త బస్టాండ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జిల్లా కాంగ్రెస్ నాయకుడు మొరిశెట్టి లక్షాది, పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య, ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డితో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కుడకుడ, బాలాజీ నగర్, శ్రీరాం నగర్ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేసిన వినతిని పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అడ్డా కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

పాఠశాలల ప్రారంభ సమయంలో ట్రాఫిక్ రద్దీ, విద్యార్థుల భద్రత, ప్రజల రాకపోకలు, అడ్డా కూలీల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని ఉదయం 9 గంటల తర్వాత ట్రాఫిక్ సిగ్నల్స్‌ను పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ట్రాఫిక్ నియంత్రణ వ్యవస్థను నిర్వహిస్తే రాకపోకలు మరింత సులభతరం అవుతాయని తెలిపారు.

కొత్త బస్టాండ్ ఎదుట ఉన్న అడ్డా కూలీల స్థలాన్ని ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా కుడకుడ రోడ్డు వైపు కొంత దూరానికి మార్చే అవకాశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు అడ్డా కూలీలకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News